కొవిడ్‌ భయంతో భార్యాపిల్లల హత్య!

ABN , First Publish Date - 2021-12-05T08:04:06+05:30 IST

ఆయనో వైద్యుడు అయివుండి కరోనా విషయంలో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ‘అన్ని సమస్యల నుంచి నా కుటుంబసభ్యులకు క్షణంలో విముక్తి కల్పించి...

కొవిడ్‌ భయంతో భార్యాపిల్లల హత్య!

 తీవ్ర డిప్రెషన్‌తో 61 ఏళ్ల వైద్యుడి ఉన్మాదం.. యూపీలో ఘటన

కాన్పూర్‌, డిసెంబరు 4: ఆయనో వైద్యుడు అయివుండి కరోనా విషయంలో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ‘అన్ని సమస్యల నుంచి నా కుటుంబసభ్యులకు క్షణంలో విముక్తి కల్పించి, వారికి స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను’  అని లేఖ రాసి తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. యూపీలోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుడు 61 ఏళ్ల సుశీల్‌ కుమార్‌. ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో భార్య చంద్రప్రభ (48), కుమారుడు, ఇంజనీరింగ్‌ విద్యార్థి శిఖర్‌ సింగ్‌(18)..  కూతురు, హై స్కూల్‌ విద్యార్థిని ఖుషీ సింగ్‌(16)కు టీలో మత్తు పదార్థాన్ని కలిపి ఇచ్చాడు. అందరూ మత్తులోకి వెళ్లగానే భార్యను తలపై సుత్తితో కొట్టి చంపాడు. అనంతరం శిఖర్‌, ఖుషీని గొంతు నులిమి చంపాడు. నయంకాని జబ్బుతో తాను బాధపడుతున్నట్లు లేఖలో సుశీల్‌ రాశాడు. తాను తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నానని.. తన భార్య, పిల్లలను ఇబ్బందులోకి నెట్టడం ఇష్టం లేక వారిని చంపేశానని రాశాడు. కరోనా కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఆ మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టదని కూడా లేఖలో పేర్కొన్నాడు.  

Updated Date - 2021-12-05T08:04:06+05:30 IST