Delhi బీజేపీ ప్రధాన కార్యాలయంలో 50 మందికి కరోనా

ABN , First Publish Date - 2022-01-12T17:58:43+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో దాదాపు 50 మంది సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలినట్లు...

Delhi బీజేపీ ప్రధాన కార్యాలయంలో 50 మందికి కరోనా

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో దాదాపు 50 మంది సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలినట్లు బుధవారం ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా కో-హెడ్ ఇన్‌ఛార్జ్ సంజయ్ మయూఖ్‌తో సహా దాదాపు 50 మందికి కరోనా సోకింది. దీంతో వారిని క్వారంటైన్‌కు కరోనా సోకిన వారందరూ కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం చికిత్స పొందుతున్నారు. బీజేపీ కార్యాలయంలో శానిటైజ్ చేశారు. బీజేపీ కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ప్రధాన కార్యాలయానికి వస్తున్నారని బీజేపీ నేతలు చెప్పారు.


మంగళవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ రోజు రెండో విడత సమావేశం జరగనుంది.సోమవారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తనకు కొవిడ్ సోకినట్లు చెప్పారు.కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌లకు కూడా సోమవారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దేశంలో గత 24 గంటల్లో 1,94,720 తాజా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా వల్ల 442 మంది మరణించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.


Updated Date - 2022-01-12T17:58:43+05:30 IST