కొవిడ్ బాధితులకు ప్రత్యేక సదుపాయాలు
ABN , First Publish Date - 2021-05-10T05:57:39+05:30 IST
కొవిడ్ బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, మున్సిపల్ కమిషనర్ వి.అయ్యప్పనాయుడులు పేర్కొన్నారు.
అమలాపురం
టౌన్, మే 9: కొవిడ్ బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్
చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, మున్సిపల్ కమిషనర్
వి.అయ్యప్పనాయుడులు పేర్కొన్నారు. బోడసకుర్రు కొవిడ్కేర్ సెంటర్ను
ఆదివారం అధికారులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ పరిశీలించారు. కొవిడ్
బాధితులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆ ప్రాంతంలో చేపడుతున్న
ప్రత్యేక పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. వారి వెంట మున్సిపల్
వైస్చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్, మున్సిపల్ డీఈ కె.అప్పలరాజు,
కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర తదితరులు ఉన్నారు.