రాజధానిలో కరోనా వ్యాప్తికి బ్రేక్... గత 24 గంటల్లో ఒక్కరూ మృతి చెందలేదు!

ABN , First Publish Date - 2021-07-25T13:07:26+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో గడచిన 24 గంటల్లో...

రాజధానిలో కరోనా వ్యాప్తికి బ్రేక్... గత 24 గంటల్లో ఒక్కరూ మృతి చెందలేదు!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరు కూడా మృతి చెందలేదు. అయితే ఇదేసమయంలో కొత్తగా 66 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి రేటు 0.09గా ఉంది. జూలై 18న కూడా కరోనాతో ఏ ఒక్కరూ మృతి చెందలేదు. ఆరోజు కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేవిధంగా ఈ ఏడాది మార్చి 2న కూడా కరోనాతో ఎవరూ మృతి చెందలేదు. 


అయితే ఆరోజు 217 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఏప్రిల్- మే నెలల్లో కరో్నా సెకెండ్ వేవ్ వచ్చింది. నగరంలో ఇప్పటివరకూ కరోనా నుంచి 14,10,216 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ కేసులు తగ్గడంతో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(డీడీఎంఏ) జూలై 26 నుంచి ఢిల్లీ మెట్రోతో పాటు బస్సు సర్వీసులను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు అనుమతినిచ్చింది. సినిమాహాళ్లు, మల్టీ‌ఫ్లెక్స్‌లు 50 శాతం సామర్థ్యంతో తెరవవచ్చని పేర్కొంది. అయితే థర్డ్ వేవ్ ముప్పు దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా కరోనా గైడ్‌లైన్స్ పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Updated Date - 2021-07-25T13:07:26+05:30 IST