50 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-10-27T05:23:09+05:30 IST

జిల్లాలో కొత్తగా 50 మందికి కరోనా వైరస్‌ సోకింది. మంగళవారం ఉదయం వరకు 1,797 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 2.78 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది.

50 మందికి కరోనా

గుంటూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 50 మందికి కరోనా వైరస్‌ సోకింది. మంగళవారం ఉదయం వరకు 1,797 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 2.78 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. 37 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకోవడంతో క్రియాశీలక కేసుల సంఖ్య 467కి తగ్గింది. సత్తెనపల్లి, మంగళగిరిలో ఒక్కొక్కరు కొవిడ్‌తో మృతి చెందారు. కొత్తగా గుంటూరులో 20, తెనాలిలో 6, మంగళగిరిలో 4, పొన్నూరులో 2, రేపల్లెలో 2, పిట్టలవానిపాలెంలో 2, ముప్పాళ్లలో 2, సత్తెనపల్లిలో 2, తాడేపల్లిలో 2, చిలకలూరిపేటలో 2, నరసరావుపేటలో 1, వట్టిచెరుకూరులో 1, తాడికొండలో 1, మేడికొండూరులో 1, దాచేపల్లిలో 1, మాచవరంలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌చార్జి అధికారి డాక్టర్‌ టీ జయసింహ తెలిపారు. మంగళవారం మెగా వాక్సినేషన్‌ నిర్వహించారు. 41,213 మందికి కొత్తగా తొలి డోసు, 20,321 మందికి రెండో డోసు వేశారు. దీంతో ఇప్పటి వరకు ఒక్క డోసు తీసుకున్న వారి సంఖ్య 32 లక్షల 245కి చేరుకోగా వారిలో 14 లక్షల 21 వేల 452 మంది రెండో డోసు తీసుకున్నారు. 

Updated Date - 2021-10-27T05:23:09+05:30 IST