132 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-09-18T06:16:24+05:30 IST
జిల్లాలో కొత్తగా 132 మందికి కరోనా వైరస్ సోకింది.
గుంటూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 132 మందికి కరోనా వైరస్ సోకింది. శుక్రవారం ఉదయం వరకు 4,456 శాంపిల్స్ పరీక్షలు జరగ్గా వాటిల్లో 2.96 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. శుక్రవారం గుంటూరులో 36, నరసరావుపేటలో 14, చిలకలూరిపేటలో 6, నాదెండ్లలో 6, తెనాలిలో 6, మంగళగిరిలో 5, తాడేపల్లిలో 5, బాపట్లలో 4, వట్టిచెరుకూరులో 4, తుళ్లూరులో 3, గుంటూరు రూరల్లో 3, కారంపూడిలో 3, వినుకొండలో 3, పిడుగురాళ్లలో 2, దుర్గిలో 2, తాడికొండలో 2, సత్తెనపల్లిలో 2, పెదనందిపాడులో 2, నూజెండ్లలో 2, కొల్లూరులో 2, నిజాంపట్నంలో 2, చెరుకుపల్లిలో 1, కొల్లిపరలో 1, నగరంలో 1, పిట్టలవానిపాలెంలో 1, పొన్నూరులో 1, రేపల్లెలో 1, వేమూరులో 1, ముప్పాళ్లలో 1, మేడికొండూరులో 1, ప్రత్తిపాడులో 1, రాజుపాలెంలో 1, దాచేపల్లిలో 1, మాచవరంలో 1, రెంటచింతలలో 1, బొల్లాపల్లిలో 1, శావల్యాపురంలో 1 పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. శుక్రవారం 24,639 మందికి తొలి డోసు, 20,254 మందికి రెండో డోసు టీకా వేసినట్లు చెప్పారు.