14 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-12-04T05:35:16+05:30 IST

జిల్లాలో కొత్తగా 14 మందికి కరోనా వైరస్‌ సోకింది.

14 మందికి కరోనా

గుంటూరు (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 14 మందికి కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం నిర్వహించిన 1,421 టెస్టుల్లో 0.99 శాతం పాజిటివ్‌రేట్‌ నమోదైంది. కొత్తగా గుంటూరులో 5, తెనాలిలో 2, తాడేపల్లిలో 2, మంగళగిరిలో 2, గురజాలలో 1, నాదెండ్లలో 1, పిట్టలవానిపాలెంలో 1 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


కొవిడ్‌ నగదు జమ చేశాం

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో చనిపోయిన 2,030 మంది కొవిడ్‌ మృతుల వారసుల బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేల వంతున నగదు జమ చేసినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడం, మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఉండని వారి ఖాతాల్లో నగదు జమకాలేదన్నారు. వారు  ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ పక్కన ఉన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రూంలో సంప్రదించాలన్నారు. 


 

Updated Date - 2021-12-04T05:35:16+05:30 IST