ఇద్దరు మృతి.. 16 కేసులు

ABN , First Publish Date - 2021-12-06T05:33:14+05:30 IST

జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతి చెందగా కొత్తగా 16 కరోనా కేసులు వెలుగు చూశాయి.

ఇద్దరు మృతి.. 16 కేసులు

గుంటూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతి చెందగా కొత్తగా 16 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఆదివారం నిర్వహించిన 1,757 టెస్టుల్లో 0.91 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. కొత్తగా నమోదైన వాటితో కలిపి క్రియాశీలక కేసులు 220కి చేరాయి. వాటిల్లో 137 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. కొత్తగా గుంటూరులో 4, బాపట్లలో 4, తాడేపల్లిలో 3, తెనాలిలో 2, వట్టిచెరుకూరులో 1, చిలకలూరిపేటలో 1, యడ్లపాడులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. గుంటూరు నగరం, దుగ్గిరాలల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 


========================================================================================

Updated Date - 2021-12-06T05:33:14+05:30 IST