Covid: తగ్గుముఖం పట్టిన కరోనా

ABN , First Publish Date - 2022-09-02T18:47:26+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 546ల మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

Covid: తగ్గుముఖం పట్టిన కరోనా

బెంగళూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 546ల మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరు(Bangalore)లో 417 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా 11 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. 18 జిల్లాలన్నింటినీ కలిపి 129 మంది బాధితులు నమోదయ్యారు. 1612 మంది కోలుకోగా గడిచిన 24గంటల వ్యవధిలో ఒకరూ మృతి చెందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5,379 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 3,546 మంది ఉన్నారు.

Updated Date - 2022-09-02T18:47:26+05:30 IST