648 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-06-16T16:26:09+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరు కేంద్రంగా తీవ్రమవుతున్నాయి. బుధవారం 648 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 615 మందికి
బెంగళూరు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరు కేంద్రంగా తీవ్రమవుతున్నాయి. బుధవారం 648 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 615 మందికి ప్రబలింది. దక్షిణకన్నడలో 12 మంది, మైసూరులో ఐదుగురు, ధారవాడ నలుగురు, శివమొగ్గ ముగ్గురు, తుమకూరులో ఇద్దరికి ప్రబలగా ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 532 మంది కోలుకోగా బెంగళూరులో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 3997 మంది చికిత్సలు పొందుతున్నారు.