750 మందికి Covid పాజిటివ్

ABN , First Publish Date - 2022-06-19T16:50:56+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు 750 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

750 మందికి Covid పాజిటివ్

బెంగళూరు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు 750 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోనే 716 మందికి వైరస్‌ సోకగా మైసూరులో 8, దక్షిణకన్నడలో 7, ఉడుపిలో 6, శివమొగ్గలో 5, ధారవాడలో 4, బళ్లారి, బెళగావిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. 425 మంది కో లుకోగా గడిచిన 24 గంటల్లో మృతులు లేరు. ప్రస్తుతం 4,825 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 4,653 మంది ఉన్నారు.

Updated Date - 2022-06-19T16:50:56+05:30 IST