Covid: 1,889 మందికి కరోనా
ABN , First Publish Date - 2022-07-29T16:06:25+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు(Covid cases) రోజూ పెరుగుతున్నాయి. గురువారం 1,889 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1,475
బెంగళూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు(Covid cases) రోజూ పెరుగుతున్నాయి. గురువారం 1,889 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1,475 ధారవాడలో 46, మైసూరు(Mysore)లో 39, బాగల్ కోట 38, కలబురిగి 24, బళ్లారి 26, కోలార్ 23, కొడుగు 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యంది. యాదగిరి జిల్లా మినహా అన్ని జిల్లాలో కేసులు నమోదు అయ్యాయి. 1,587 మంది డిశ్చార్జ్ కాగా, 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. బెళగావి, దక్షిణ కన్నడ, దావణగెరె(Davanagere)లో 9,135 చికిత్స పొందుతున్నారు. వీరిలో బెంగళూరు నగర వాసులు 7,486 మంది అత్యధికంగా ఉన్నారు.