క్రమంగా పెరుగుతున్న Covid కేసులు

ABN , First Publish Date - 2022-06-10T16:00:21+05:30 IST

రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 471మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

క్రమంగా పెరుగుతున్న Covid కేసులు

                                    - 471 మందికి పాజిటివ్ 


బెంగళూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 471మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 458మంది ఉండగా బెంగళూరు గ్రామీణ, దక్షిణకన్నడ, ధారవాడలో ముగ్గురు చొప్పున, బీదర్‌లో ఇద్దరు, కలబురగి, ఉడుపిలలో ఒకరు చొప్పున ఉన్నారు. 214మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటలలో ఎవరూ మృతి చెందలేదు. ప్రస్తుతం 2880మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 2,776మంది ఉన్నారు.  

Updated Date - 2022-06-10T16:00:21+05:30 IST