రాష్ట్రంలో పెరుగుతున్న Covid కేసులు
ABN , First Publish Date - 2022-06-29T16:42:47+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించిన బులెటిన్ ప్రకారం 986మందికి పాజిటివ్ నిర్ధారణ
- 968 మందికి పాజిటివ్
బెంగళూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించిన బులెటిన్ ప్రకారం 986మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులోనే 887మందికి సో కింది. దక్షిణకన్నడలో 21, ఉడుపిలో 17, మైసూరులో 14, ధారవాడలో 10, బళ్ళారి, బెంగళూరు గ్రామీణలో 3 చొప్పున, బెళగావి, బీదర్, హాసన్లో 2 చొప్పున, నాలుగు జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయి. 337మంది కోలుకోగా గడిచిన 24 గంటల్లో దక్షిణకన్నడలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 4918 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 4682మంది ఉన్నారు.