పెరుగుతున్న Covid కేసులు
ABN , First Publish Date - 2021-12-12T17:37:23+05:30 IST
గడిచిన నెలరోజుల క్రితం వరకు 300లోపుగా కొవిడ్ కేసులు నమోదవుతుండగా తాజాగా కొంతమేర పెరిగాయి. శనివారం 320 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 30 లక్షల మంది బాధితులయ్యారు. బెంగళూరులో 190 మంది, కొడగులో
బెంగళూరు: గడిచిన నెలరోజుల క్రితం వరకు 300లోపుగా కొవిడ్ కేసులు నమోదవుతుండగా తాజాగా కొంతమేర పెరిగాయి. శనివారం 320 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 30 లక్షల మంది బాధితులయ్యారు. బెంగళూరులో 190 మంది, కొడగులో 21మందికి సోకగా 10 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో 14 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. నాలుగు జిల్లాల్లో 20లోపు బాధితులు నమోదయ్యారు. 317 మంది కోలుకోగా బెంగళూరులో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కరూ మృతిచెందలేదు. 7,306 మంది చికిత్సలు పొందుతున్నారు. రాష్ట్రంలో తొలివిడత కొవిడ్ నుంచి ఇప్పటి వరకు 30లక్షల మంది బాధితులు కాగా అత్యధికంగా బెంగళూరులోనే కేసులు నమోదయ్యాయి. 12.58 లక్షల మందికి కొవిడ్ సోకగా 12.36 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 16,362 మంది కొవిడ్తో మృతి చెందారు.