కొనసాగుతున్న వైరస్‌ ఉధృతి

ABN , First Publish Date - 2021-04-21T06:36:37+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కలవరపెడుతోంది.

కొనసాగుతున్న వైరస్‌ ఉధృతి
ఒంగోలు రిమ్స్‌లోని కొవిడ్‌ అడ్మిషన్‌ వార్డు వద్ద అవస్థలు పడుతున్న బాధితులు

మరో 305 పాజిటివ్‌లు నమోదు

ఒంగోలులో అధికంగా 138 కేసులు

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 20 :జిల్లాలో కొవిడ్‌ కలవరపెడుతోంది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 305మందికి కొత్తగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వారిలో అత్యధికంగా 138 మంది ఉన్నారు. చీరాలలో 33, పర్చూరులో 24, అద్దంకిలో 20, జె.పంగులూరులో 12, మార్టూరులో 12మందికి వైరస్‌ సోకింది. యద్దనపూడిలో 9,కొత్తపట్నంలో 9, దొనకొండలో 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారితోపాటు చీమకుర్తి, కందుకూరు, కనిగిరి, పొదిలి, తర్లుపాడు, బల్లికురవ, నాగులుప్పలపాడు తదితర ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 



Updated Date - 2021-04-21T06:36:37+05:30 IST