కొనసాగుతున్న వైరస్ ఉధృతి
ABN , First Publish Date - 2021-04-21T06:36:37+05:30 IST
జిల్లాలో కొవిడ్ కలవరపెడుతోంది.
మరో 305 పాజిటివ్లు నమోదు
ఒంగోలులో అధికంగా 138 కేసులు
ఒంగోలు (కార్పొరేషన్), ఏప్రిల్ 20 :జిల్లాలో కొవిడ్ కలవరపెడుతోంది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 305మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వారిలో అత్యధికంగా 138 మంది ఉన్నారు. చీరాలలో 33, పర్చూరులో 24, అద్దంకిలో 20, జె.పంగులూరులో 12, మార్టూరులో 12మందికి వైరస్ సోకింది. యద్దనపూడిలో 9,కొత్తపట్నంలో 9, దొనకొండలో 8 మందికి పాజిటివ్ వచ్చింది. వారితోపాటు చీమకుర్తి, కందుకూరు, కనిగిరి, పొదిలి, తర్లుపాడు, బల్లికురవ, నాగులుప్పలపాడు తదితర ప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదయ్యాయి.