COVID third wave scare: కేరళలో జనసమ్మర్థంపై నిషేధాస్త్రం
ABN , First Publish Date - 2021-08-11T15:47:13+05:30 IST
కొవిడ్ థర్డ్ వేవ్ ప్రబలుతుందనే భయంతో కేరళ రాష్ట్రంలో జనసమ్మర్ధంపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
తిరువనంతపురం (కేరళ): కొవిడ్ థర్డ్ వేవ్ ప్రబలుతుందనే భయంతో కేరళ రాష్ట్రంలో జనసమ్మర్ధంపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కేరళలో ఓనం, మొహరం, జన్మాష్టమి, గణేశ్ చతుర్థి, దుర్గాపూజ పండుగల సందర్భంగా ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని కేరళ సర్కారు అధికారులను ఆదేశించింది. పండుగల సందర్భంగా జనం గుమిగూడితే కరోనా వైరస్ ప్రబలే అవకాశమున్నందున జనసమ్మర్ధంపై నిషేధం విధించామని కేరళ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వీపీ జాయ్ చెప్పారు. పండుగల సందర్భంగా జనం గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాన్ని కేరళ సర్కారు అమలు చేస్తోంది.
కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 12వతేదీ నుంచి ఆంక్షలు విధించనున్నారు.శబరిమల దర్శనం కోసం రోజుకు కేవలం 15వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు.వ్యాక్సిన్ వేయించుకున్న వారు, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్న భక్తులను మాత్రమే శబరిమల దర్శనానికి అనుమతిస్తారు.