టీకా వేసుకున్న టీచర్లకు మాత్రమే అనుమతి

ABN , First Publish Date - 2021-12-05T16:41:30+05:30 IST

రాష్ట్రంలో 95 శాతం మంది ఉపాధ్యాయులు టీకాలు వేసుకున్నారని, టీకాలు వేసుకున్న టీచర్లు మాత్రమే పాఠశాలకు రావాలని పుదుచ్చేరి హోంశాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు. పుదుచ్చేరిలో శనివారం మంత్రి

టీకా వేసుకున్న టీచర్లకు మాత్రమే అనుమతి

                     - పుదుచ్చేరి మంత్రి నమశ్శివాయం


పుదుచ్చేరి: రాష్ట్రంలో 95 శాతం మంది ఉపాధ్యాయులు టీకాలు వేసుకున్నారని, టీకాలు వేసుకున్న టీచర్లు మాత్రమే పాఠశాలకు రావాలని పుదుచ్చేరి హోంశాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు. పుదుచ్చేరిలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొంటున్న విద్యార్థులను పర్యవేక్షించడం కష్టంగా ఉందని తల్లిదండ్రులు తెలుపడంతో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభించి 1 నుంచి 8వ తరగతి వరకు నేరుగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రారంభించిన 9 నుంచి ప్లస్‌ టూ తరగతులు సోమవారం నుండి పాత సమయంలో షిఫ్టు విధానంలో నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2021-12-05T16:41:30+05:30 IST