దేశంలో 122.41 మంది కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ
ABN , First Publish Date - 2021-11-29T21:15:28+05:30 IST
దేశ వ్యాప్ంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం నాటికి దేశంలో 122.41 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్: దేశ వ్యాప్ంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం నాటికి దేశంలో 122.41 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గడచిన 24 గంటల్లో 42.04 లక్షలమందికి వ్యాక్సిన్ వేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.34 శాతం వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,309 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 1,03,859 కేసులు కాగా గడిచిన 15 రోజుల్లో పాజిటివ్ రేట్ 1 శాతం(0.85)గా వుంది.