దేశంలో 125.75 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-03T21:31:33+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. శుక్రవారం నాటికి దేశంలో 125.75 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలో 125.75 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. శుక్రవారం నాటికి దేశంలో 125.75 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 73.67లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దేశంలో కోవిడ్ రికవరీ రేట్ 98.35 శాతం వుంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 9,216 కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసులు 99,976 కాగా గడిచిన 19 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం (0.84శాతం)గా అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-03T21:31:33+05:30 IST