
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశంలో 132.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 89 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.36శాతం కాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 7,774 కేసులునమోదైనట్టు అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసులు 92,281 కాగా గడిచిన 28 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం(0.70శాతం)గా నమోదయ్యింది.