దేశంలో 135.25 కోట్ల కరోనా డోసుల పంపిణీ
ABN , First Publish Date - 2021-12-16T20:29:45+05:30 IST
దేశంలో కోవిడ్ బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది.
హైదరాబాద్: దేశంలో కోవిడ్ బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 135.25 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒకప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 60లక్షల డోసుల పంపిణీ జరిగినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.38 శాతం కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 87,245 కాగా గడిచిన 32 రోజుల్లో వీక్లీ పాజిటివ్ కేసుల సంఖ్య 1శాతం (0.64శాతం)గా నమోదైంది.