దేశంలో 159.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-20T22:09:37+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్తవం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది.

దేశంలో 159.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్తవం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటి వరకూ 159.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 73 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 93.69 శాతంగా వుంది. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,17,532 కేసులు నమోదయ్యాయి. వీటిలో 9,287 ఒమైక్రాన్ కేసులుగా గుర్తించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,951 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 16.06 శాతంగా నమోదైంది. 

Updated Date - 2022-01-20T22:09:37+05:30 IST