దేశంలో 163.84 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-27T20:45:24+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది.

దేశంలో 163.84 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 163.84 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన 24గంటల్లో 22 లక్షల డోసులను పంపిణీ చేశామని తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 93.33 శాతం కాగా గడిచిన 24గంటల్లో 2,86,384 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472 కాగా రికవరీ శాతం 93.33 శాతంగా వుంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 17.75 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-27T20:45:24+05:30 IST