దేశంలో 165.70 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-30T20:25:27+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

దేశంలో 165.70 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అందులో భాగంగానే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 165.70కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 62 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 94.21 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,84,937 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 16.40 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-30T20:25:27+05:30 IST