దేశంలో 167.87 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-02-03T20:20:04+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్టమైనచర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేకార్యక్రమం చేపట్టింది.

దేశంలో 167.87 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్టమైనచర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేకార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 167.87 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 55లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 95.14 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,72,433 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,33,921 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 12.98 శాతంగా పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-03T20:20:04+05:30 IST