దేశంలో 168.47 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-02-04T21:19:43+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ ను పెద్దసంఖ్యలో పంపిణీ చేస్తోంది.

దేశంలో 168.47 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ ను పెద్దసంఖ్యలో పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ దేశంలో 168.47 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లోనే 55 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 95.39 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,49,393 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,35,565 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 12.03 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-02-04T21:19:43+05:30 IST