దేశంలో 169.46 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-02-06T21:48:14+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలుతీసుకుంటోంది.

దేశంలో 169.46 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలుతీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకూ 169.46 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24గంటల్లో 45 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 95.91 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,07,474 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,25,011 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 10.20 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-02-06T21:48:14+05:30 IST