దేశంలో 171.79 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-02-11T21:30:38+05:30 IST

దేశంలో కరోనా వ్యాప్తని నిర్మూలించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

దేశంలో 171.79 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తని నిర్మూలించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 171.79కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.గడిచిన 24 గంటల్లో 48.18 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 97.17 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,077 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 6,97,802 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 5.76 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-02-11T21:30:38+05:30 IST