దేశంలో 172.29 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-02-12T20:35:22+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది.

దేశంలో 172.29 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 172.82 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అదికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో గడిచిన 24గంటల్లో 46.82 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా దేశంలో రికవరీ రేట్ 97.37 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,407 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,443 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 5.07 శాతంగా అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-02-12T20:35:22+05:30 IST