దేశంలో 175.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-02-20T20:37:53+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పెద్దయెత్తున చర్యలు తీసుకుంటోంది.

దేశంలో 175.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్:దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పెద్దయెత్తున చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టింది. దేశంలో ఇప్పటి వరకూ 175.37కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 30.81 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. దేశంలో రికవరీ రేట్ 98.28 శాతం కాగా, గడిచిన 24గంటల్లో కొత్తగా 19,968 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 2,24,187 కాగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 2.27 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-02-20T20:37:53+05:30 IST