దేశంలో 132 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-11T20:25:09+05:30 IST

దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలకుండా కేంద ప్రభుత్వం చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది.

దేశంలో 132 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలకుండా కేంద ప్రభుత్వం చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 132 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలోవెల్లడించింది. గడిచిన 24గంటల్లో 76లక్ష‌ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.36శాతంగా వుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తకేసుల సంఖ్య 7,992గా నమోదైంది. గడిచిన 559 రోజుల్లో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 93,277గా అధికారులు తెలిపారు. గడిచిన 27 రోజుల్లో వీక్లీ పాజిటివిటీ 1శాతం (0.71శాతం)గా నమోదైంది. 

Updated Date - 2021-12-11T20:25:09+05:30 IST