నేటి నుంచి రెండో డోస్
ABN , First Publish Date - 2021-04-22T15:04:02+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్..
గుంటూరు: కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారికి గురువారం నుంచి రెండో డోస్ వేయడం జరుగు తుందని జేసీ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్సెంటర్లు, గుంటూరులోని జీజీహెచ్లో రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 120 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసు కున్న వారు ఈ అవకాశా న్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు.