అబుధాబిలో ఎంట్రీపై UAE కీలక ప్రకటన..!

ABN , First Publish Date - 2022-01-19T13:52:49+05:30 IST

కరోనా వైరస్ విజృంభణ వేళ అరబ్ దేశం యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అబుధాబిలో ఎంట్రీపై UAE కీలక ప్రకటన..!

అబుధాబి: కరోనా వైరస్ విజృంభణ వేళ అరబ్ దేశం యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని అబుధాబిలో ప్రవేశంపై ఆంక్షలు విధించింది. అబుధాబిలో ఎంట్రీకి బూస్టర్ డోసును తప్పనిసరి చేసింది. ఈ మేరకు యూఏఈ అధికారిక 'అల్ హోస్నా' యాప్‌లో కీలక అప్డేట్ చేసింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని పేర్కొంది. యాప్ ద్వారా బూస్టర్ డోసు కోసం స్లాట్ బూక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. బూస్టర్ డోసు తీసుకున్నవారినే వ్యాక్సినేషన్ పూర్తైనట్లు పరిగణించడం జరుగుతుందని తెలిపింది. అంతేగాక బూస్టర్ డోసు తీసుకున్నవారికి మాత్రమే అబుధాబిలో ప్రవేశం ఉంటుందని స్పష్టం చేసింది.     



Updated Date - 2022-01-19T13:52:49+05:30 IST