ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-03-09T06:53:20+05:30 IST

కొవిడ్‌ బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్‌ వేయించుకోవాలని జేసీ కె. వెంకటరమణారెడ్డి సూచించారు.

ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ వేయించుకోవాలి
వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న జేసీ కె.వెంకటరమణారెడ్డి

 జేసీ కె.వెంకటరమణారెడ్డి

ఏలూరు సిటీ, మార్చి 8 : కొవిడ్‌ బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్‌ వేయించుకోవాలని జేసీ కె. వెంకటరమణారెడ్డి సూచించారు. స్థానిక కేంద్ర ఆస్పత్రిలో కొవిడ్‌ టీకా రెండో డోసు ఆయన వేయించుకున్నారు. కొవిడ్‌–19 సందర్భంగా గత మార్చి నుంచి సుమారు ఏడాది పాటు మన మంతా ఎన్నో బాధలు ఎదుర్కొన్నామన్నారు. మొదటి దశలో హెల్త్‌ వర్క్‌ర్లకు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు, వాక్సినేషన్‌ అందించామ న్నారు. ప్రస్తుతం రెండో ఫేజ్‌లో 60 ఏళ్లు పైబడిన వారితో పాటు, అర్హులైన ఇతరులకు గుర్తించిన ప్రభుత్వాస్పత్రులలో ఉచితంగా అందిస్తున్నామన్నారు. వాక్సిన్‌ తీసుకోవ డం వల్ల జ్వరం వస్తుందని, సురక్షితం కాదని కొంతమంది అపోహలు పడుతు న్నారని, అవి ఏమాత్రం నిజం కాదన్నారు. వాక్సిన్‌ సురక్షితమైనదని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-09T06:53:20+05:30 IST