కరోనాతో మరో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-07-25T18:33:29+05:30 IST
కృష్ణగిరి జిల్లాలో శనివారం కరోనాతో మరో మహిళ మృతిచెందినట్లు ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. కృష్ణగిరి ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల మహిళ గత కొద్దిరోజులుగా కరోనాకు చికిత్స పొందుతూ మృ
కృష్ణగిరి(కర్ణాటక): కృష్ణగిరి జిల్లాలో శనివారం కరోనాతో మరో మహిళ మృతిచెందినట్లు ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. కృష్ణగిరి ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల మహిళ గత కొద్దిరోజులుగా కరోనాకు చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో కొవిడ్తో 321మంది మృత్యువాత చెందారని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒకే రోజున 20 మందికి కరోనా నిర్ధారణ కాగా 49 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యా రన్నారు. జిల్లా మొత్తంగా ప్రస్తుతం 401 మంది చికిత్సలు పొందుతున్నట్టు తెలిపారు.