1.70 శాతానికి తగ్గిన కరోనా

ABN , First Publish Date - 2020-11-29T06:01:12+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ శాతం శనివారం 1.70కు తగ్గింది.

1.70 శాతానికి తగ్గిన కరోనా

తాజాగా 68 మందికే పాజిటివ్‌


గుంటూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ శాతం శనివారం 1.70కు తగ్గింది. వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన 4,011 శాంపిల్స్‌ ఫలి తాల్లో కేవలం 68 మందికి మాత్రమే పాజిటివ్‌ రాగా మిగతా 3,943(98.30 శాతం) మందికి నెగిటివ్‌ వచ్చిం ది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,365కి చేరుకోగా వారిలో 72,892(98.02 శాతం) మంది కోలుకున్నారు. 711 మంది చనిపోయా రు. ప్రస్తుతం 752 మంది చికిత్స పొందుతోన్నారు. శనివారం మరో 4,084 మంది వద్ద స్వాబ్‌లు పరీక్ష నిమిత్తం సేకరించారు. కొత్తగా గుంటూరు నగరంలో 21, తాడేపల్లిలో 6, వేమూరులో 6, పొన్నూరులో 3, కొల్లిపరలో 3, బాపట్లలో 3, పిడుగురాళ్లలో 3 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మిగిలిన మండలాల్లో 23 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ తెలిపారు.  

Updated Date - 2020-11-29T06:01:12+05:30 IST