కొవిడ్తో బోసిబోయిన గూడూరు రైల్వేస్టేషన్
ABN , First Publish Date - 2021-05-09T03:55:33+05:30 IST
కొవిడ్ కారణంగా ప్రయాణికులు లేక గూడూరు రైల్వేస్టేషన్ బోసిబోయింది. చెన్నై, తిరుపతిలకు ఈ స్టేషన్మీదే వెళ్లాల్సి ఉండడం, ప్రతి రోజు ఈ స్టేషన్ మీదుగా 50కి పైగా రైళ్లు ప్రయాణిస్తుండడంతో, ప్రయాణికులతో ఫ్లాట్ఫాంలు రద్దీగా ఉండేవి.
కొవిడ్తో బోసిబోయిన గూడూరు రైల్వేస్టేషన్
గూడూరురూరల్, మే 8: కొవిడ్ కారణంగా ప్రయాణికులు లేక గూడూరు రైల్వేస్టేషన్ బోసిబోయింది. చెన్నై, తిరుపతిలకు ఈ స్టేషన్మీదే వెళ్లాల్సి ఉండడం, ప్రతి రోజు ఈ స్టేషన్ మీదుగా 50కి పైగా రైళ్లు ప్రయాణిస్తుండడంతో, ప్రయాణికులతో ఫ్లాట్ఫాంలు రద్దీగా ఉండేవి. ప్రస్తుతం 20 రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. గూడూరు నుంచి విజయవాడ వెళ్లే విక్రమసింహపురి ఎక్స్ప్రెస్, తిరుపతి కరీంనగర్ స్పెషల్, కాకినాడ-తిరుపతి కాకినాడ స్పెషల్, తిరుపతి - విశాఖపట్నం డబుల్డెక్కర్, బిట్రగుంట-చెన్నై పాసింజర్ రైళ్లను కొవిడ్ కారణంగా రద్దుచేసినట్లు రైల్వేసిబ్బంది తెలిపారు. దీంతో రైల్వేస్టేషన్లో రైళ్లు లేక, ప్రయాణికులు లేక ఫ్లాట్ఫాంలు నిర్మానుష్యంగా మారాయి. రిజర్వేషన్ చేయించుకున్నవారు, ఫ్లాట్ఫాం టిక్కెట్ తీసుకున్నవారికి మాత్రమే రైల్వేస్టేషన్లోకి అనుమతిస్తున్నారు.