3వ తేదీన రాత్రికి రాజ్‌భవన్‌లోనే ప్రధాని మోదీ బస: సీపీ ఆనంద్

ABN , First Publish Date - 2022-07-01T22:00:40+05:30 IST

ఈనెల 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ అనంతరం ఆయన రాజ్ భవన్ కు చేరుకుంటారని, రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేస్తారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

3వ తేదీన రాత్రికి రాజ్‌భవన్‌లోనే ప్రధాని మోదీ బస: సీపీ ఆనంద్

హైదరాబాద్: ఈనెల 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ అనంతరం ఆయన రాజ్ భవన్ కు చేరుకుంటారని, రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేస్తారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.ప్రధాని బస సందర్భంగా రాజ్‌భవన్‌లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్‌భవన్ మార్గాల్లో 4 వేల మంది పోలీసులతో పహారా నిర్వహిస్తున్నట్టు సీపీ ఆనంద్ వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో పహారా కాస్తారని చెప్పారు. ప్రధాని, సీఎంలు, కేంద్రమంత్రులు సభకు హాజరవుతున్న దృష్ట్యా ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు సీపీ ఆనంద్‌ వెల్లడించారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను ఇంచార్జ్‌లుగా నియమించామన్నారు. 

Updated Date - 2022-07-01T22:00:40+05:30 IST