నేడే మొహర్రం.. బీబీకా ఆలం ఊరేగింపు
ABN , First Publish Date - 2022-08-09T06:08:54+05:30 IST
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం బీబీకా అలావాను సందర్శించి దట్టీ సమర్పించారు.
హైదరాబాద్ సిటీ ఆగష్టు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం బీబీకా అలావాను సందర్శించి దట్టీ సమర్పించారు. నిర్వాహకులు సీపీకి ప్రసాదమిచ్చి ఆశీర్వదించారు. నగర సీపీలు బీబీకా ఆలంకు దట్టీ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం మంగళవారం జరిగే మొహర్రం ఊరేగింపు (బీబీకా ఆలం) భద్రతా, బందోబస్తు ఏర్పాట్లపై సీపీ సమీక్షించారు. అదనపు సీపీలు డీఎస్ చౌహాన్, పి.విశ్వప్రసాద్, జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్, సౌత్జోన్ డీసీపీ సాయి చైతన్య ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచే డబీర్పురాలోని బీబీకా అలావా నుంచి ఊరేగింపు అంబారీపై ప్రారంభం కానుంది. ఊరేగింపు సమయంలో షియా ముస్లింలు అంబారీపై ఆలం ఉండగా.. దాని చుట్టూ మాతం (శోకం) నిర్వహిస్తారు.