రాజకీయ కక్షతో వైసీపీ పాలన: టీడీపీ

ABN , First Publish Date - 2022-10-04T05:10:07+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలపై రా జకీయంగా కక్ష సాధిస్తోందని, ఇలాంటి రాజకీయాలు ఎంతోకాలం సాగవని టీడీపీ మండల కన్వీనర్‌ దాసిరెడ్డి పేర్కొన్నారు.

రాజకీయ కక్షతో వైసీపీ పాలన: టీడీపీ
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

రొళ్ల, అక్టోబరు 3: వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలపై రా జకీయంగా కక్ష సాధిస్తోందని, ఇలాంటి రాజకీయాలు ఎంతోకాలం సాగవని టీడీపీ మండల కన్వీనర్‌ దాసిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆ యన విలేకరులతో మాట్లాడారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు ఒకేరాజధాని అమరావతి నినాదంతో రైతులు చేపట్టిన మహాపాదయాత్రను అధికార పార్టీ నాయకు లు అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. రాజధాని కోసం 35 వేల ఎకరాల భూ మిని రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా చంద్రబాబునాయుడును నమ్మి ఇచ్చారన్నారు. ఈరోజు వాళ్లు రోడ్లపైపడి పోరాడుతుంటే వైసీపీ నాయకుడు దువ్వెడ శ్రీనివాస్‌ పెయిడ్‌ ఆర్టిస్టులు అని అవహేళనగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో రాబోవు రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరిం చారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మడకశిర నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్‌ రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో పట్టభద్రులు పెద్దఎత్తున ఓటరు నమోదు చేసుకోవాలని, అవినీతి వైసీపీ పరిపాలనకు చరమగీతం పా డాలని పిలుపునిచ్చారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మం డల ప్రధాన కార్యదర్శి జీకే ఈరన్న, యూత అధ్యక్షుడు భరత పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-04T05:10:07+05:30 IST