10లోగా ‘ఇళ్ల’ను లబ్ధిదారులకు ఇవ్వాలి: సీపీఐ

ABN , First Publish Date - 2021-07-25T07:49:37+05:30 IST

ఆగస్టు 10లోగా టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు స్వాధీనపరచకపోతే మరో ఉద్యమానికి సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు

10లోగా ‘ఇళ్ల’ను లబ్ధిదారులకు ఇవ్వాలి: సీపీఐ

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఆగస్టు 10లోగా టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు స్వాధీనపరచకపోతే మరో ఉద్యమానికి సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. వరద ముంపు భూములను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వడం తగదన్నారు. సెంటు స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఏ మాత్రం సరిపోవన్నారు. కేంద్రం గ్రాంటుతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.4 లక్షలు ఒక్కో ఇంటి నిర్మాణానికి మంజూరు చేయాలని లేదా పేదల ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వమే గృహాలను నిర్మించి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-07-25T07:49:37+05:30 IST