మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఆపండి
ABN , First Publish Date - 2020-12-03T05:07:01+05:30 IST
ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లును వెంటనే ఆపాలంటూ సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
సీపీఎం నాయకుల డిమాండ్
బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 2: ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లును వెంటనే ఆపాలంటూ సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బుచ్చిరెడ్డిపాళెంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద వారు ఆందోళన నిర్వహించి, అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ముత్యాల గుర్నాధం మాట్లాడుతూ కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి ప్రభుత్వమే ప్రజలపైన పన్నుల భారం మోపే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. చట్ట సవరణ బిల్లు ఇప్పుడు చెల్లించే పన్నులకన్నా 10నుంచి 100 రెట్లు పెరిగి ప్రజలపై భారంగా తయారవుతుందన్నారు. వెంటనే ఈ బిల్లును ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జానీబాషా, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కరీముల్లా, ఖాదర్బాషా, మల్లయ్య, సుబ్రహ్మణ్యం, సీహెచ్ మల్లికార్జున పాల్గొన్నారు.