పోడు సమస్య పరిష్కారం అయ్యేదాక సీపీఐ పోరాటం చేస్తుంది: చాడ

ABN , First Publish Date - 2021-08-04T22:16:54+05:30 IST

పోడు సమస్య పరిష్కారం అయ్యేదాక సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

పోడు సమస్య పరిష్కారం అయ్యేదాక సీపీఐ పోరాటం చేస్తుంది: చాడ

కొమురం భీం: పోడు సమస్య పరిష్కారం అయ్యేదాక సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. పోడు సాగుదారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నుంచి సీపీఐ పోడుయాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఒక్క ఎకరా పోడు భూమికి కూడా సీఎం కేసీఆర్ పట్టా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కుర్చీ వేసుకుని పట్టాలు ఇస్తానని ఎన్నో సార్లు చెప్పారని, ఎప్పుడు కుర్చీ వేసుకుని ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇవ్వక పోగా పోడు రైతులపై పీడీ యాక్టులు, క్రిమినల్ కేసులు పెడుతున్నారని తెలిపారు. హరితహారం పేరిట సాగులో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, పోడు భూముల విషయంలో అటవీ, పోలీసు శాఖల తీరు ఆక్షేపనీయమన్నారు. తక్షణమే రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-04T22:16:54+05:30 IST