కుంభకోణాలను వెలికితీసేది కమ్యూనిస్టులే

ABN , First Publish Date - 2020-12-03T04:58:42+05:30 IST

చట్టసభల్లో అవినీతి, కుంభకోణాలను వెలికితీసేది కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

కుంభకోణాలను వెలికితీసేది కమ్యూనిస్టులే
సమావేశంలో మాట్లాడుతున్న వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్ధి జయసారథిరెడ్డి

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

 కొత్తగూడెం, డిసెంబరు 2: చట్టసభల్లో అవినీతి, కుంభకోణాలను వెలికితీసేది కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం శేషగిరి భవన్‌లో సీపీఐ, సీపీఎం సంయుక్త విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో అందలమెక్కిన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారాయన్నారు. చట్టసభల్లో ఉన్న మందబలంతో చీకటి చట్టాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌, మోదీ దఫేదార్లకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబిర్‌పాషా, వామపక్షాల నాయకులు బందెల నర్సయ్య, వై. శ్రీనివాసరెడ్డి, కంచర్ల జమలయ్య, గుగులోతు విజయబాయి, భూక్యా రమేష్‌, జాటోతు కృష్ణ, కృష్ణయ్య, దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్‌, చింతల రాజు, గుగులోతు రాంచందర్‌, మునిగడప వెంకటేశ్వర్లు, ఉప్పుశెట్టి రాహుల్‌, లిక్కి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T04:58:42+05:30 IST