నుపుర్ వ్యాఖ్యలపై ప్రధాని క్షమాపణ చెప్పాలి: Chada

ABN , First Publish Date - 2022-06-07T16:30:37+05:30 IST

మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా బీజేపీ నేత నుపుర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

నుపుర్ వ్యాఖ్యలపై ప్రధాని క్షమాపణ చెప్పాలి: Chada

హనుమకొండ: మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా బీజేపీ నేత నుపుర్(Nupur) చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి(Chada venkat reddy) డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మైనారిటీలు, ముస్లింలపై దాడులు ఆపాలన్నారు. ఇది రాచరిక వ్యవస్థ కాదని తెలిపారు. విభజన హామీలు అమలు చేయని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ సమావేశాలు పెట్టుకునే అర్హతలేదని అన్నారు. వరంగల్‌లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ తీరువల్లే పేదలు రోడ్డెక్కారన్నారు. మైనర్ బాలికపై రేప్ చేసిన దుండగులను శిక్షించాలని అన్నారు. సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-07T16:30:37+05:30 IST