జగన్, కేసీఆర్‌లపై మండిపడ్డ నారాయణ

ABN , First Publish Date - 2021-10-24T18:08:58+05:30 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జగన్, కేసీఆర్‌లపై మండిపడ్డ నారాయణ

మంచిర్యాల: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంతో పాటు ముఖ్యమంత్రులు దొంగల ముఠాలుగా మారారని అన్నారు. కేసీఆర్, జగన్‌లకు బీజేపీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనే చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో జగన్ రెడ్డి పరిపాలన దారుణంగా ఉందన్నారు. ఆయనే కొడతారు, ఆయనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బూతులపై నిజనిర్దారణ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. టీడీపీ బూతులు 10 శాతం ఉంటే, వైసీపీ నేతల బూతులు 90 శాంతం ఉన్నాయన్నారు. జగన్ రాక్షస పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. హుజురాబాద్‌లో బీజేపీ - టీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో ప్రజాస్వామ్య శక్తులు ఏకంగా కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ఇలాంటి త్రాస్టుడు ముఖ్యమంత్రి అవుతారని అనుకోలేదని నారాయణ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-10-24T18:08:58+05:30 IST