ట్రిబుల్ ఐటీ విద్యార్థులను పరామర్శించిన సీపీఐ నేత Narayana

ABN , First Publish Date - 2022-07-16T18:49:30+05:30 IST

ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రిబుల్ ఐటీ విద్యార్థులను సీపీఐ నేత నారాయణ పరామర్శించారు.

ట్రిబుల్ ఐటీ విద్యార్థులను పరామర్శించిన సీపీఐ నేత Narayana

నిజామాబాద్: ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రిబుల్ ఐటీ విద్యార్థుల(IIIT students) ను సీపీఐ నేత నారాయణ(Narayana) పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్యం అందిస్తామని ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. మెరుగైన వైద్యం అందించాలని.. హైదరాబాద్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. మొన్న ఆందోళనమరవక ముందే ఈ ఘటన జరగడం సిగ్గు చేటన్నారు. మెస్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని, కాంట్రాక్టు రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-16T18:49:30+05:30 IST