ఇప్పటికైనా హోదాకై జగన్ నడుం కట్టాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-06-20T18:48:08+05:30 IST

ఏపీకి ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా హోదాకై జగన్ నడుం కట్టాలి: రామకృష్ణ

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ  డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన ఏడేళ్ల కాలంలో ఏపీకి అడుగడుగునా ద్రోహం చేస్తూనే ఉన్నారన్నారు. వైసీపీ, టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి నరేంద్రమోదీ ఏపీకి చేసిన మోసం బట్టబయలవుతుందని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సాధనకై ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నడుం కట్టాలని  రామకృష్ణ హితవుపలికారు.

Updated Date - 2021-06-20T18:48:08+05:30 IST