AP: జగన్ సర్కార్పై రామకృష్ణ విమర్శ
ABN , First Publish Date - 2021-11-15T16:09:54+05:30 IST
జగన్ సర్కార్కు నిధుల వేటపై ఉన్న శ్రద్ధ పాలన, అభివృద్ధిపై లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు.
అమరావతి: జగన్ సర్కార్కు నిధుల వేటపై ఉన్న శ్రద్ధ పాలన, అభివృద్ధిపై లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. జగన్ విపరీతమైన అప్పులతో రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి రూ.250 కోట్ల నిధులను బదలాయించాలనుకోవడం సరికాదని తెలిపారు. విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన ఏపీ ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీ నిధులను ఇతర రంగాలకు మళ్ళించడాన్ని తప్పుబడుతున్నామని రామకృష్ణ అన్నారు.